
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండ్రోన్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేసిన మంత్రి వివేక్ కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ 100 ఎకరాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ నిరుపేదలు గుర్తుకు రాలేదని అన్నారు. ఏ ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని.. తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించాడని అన్నారు మంత్రి వివేక్. కేసీఆర్ లక్ష్యం కమిషన్లు వచ్చే పథకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవాడుని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు 600 చరదపు గజాల్లో కట్టుకుంటేనే ఇందిరమ్మ ఇంటి అర్హత ఉంటుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తె ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పిన వాగ్దానం నెరవేరూస్తుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు వివేక్.