
మల్కాజిగిరిలోని పద్మావతి గార్డెన్స్లో ఆదివారం రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో మాలల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు కాగా, సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మాలల వివాహ వేదిక చైర్మన్ త్యాగరాజు, అధ్యక్షుడు కపిల్కుమార్, సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరరీ నర్సింగ్రావు పాల్గొన్నారు.