ఐటీఐ ఇనిస్టిట్యూట్స్ను అభివృద్ది చేస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఐటీఐ ఇనిస్టిట్యూట్స్ను అభివృద్ది చేస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఐటీఐ కాలేజీల ప్రిన్సిపల్స్​ ఓరియంటేషన్​ వర్క్​షాపు ముగింపు కార్యక్రమంలో మంత్రి వివేక్​వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా ట్రైనింగ్​ సెంటర్​కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.  తన తండ్రిగారు స్వర్గీయ వెంటకటస్వామి గారు కార్మికశాఖామంత్రిగా ఉన్న సమయంలో ఐటీఐ సెక్టార్​ పై దృష్టి పెట్టారని .. తనకు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు.

ప్రస్తుతం మన దగ్గర 65 ఐటీఐ ఇనిస్టిట్యూట్స్​ ఉన్నాయని... వాటిని నూతన టెక్నాలజీతో అప్​గ్రేడ్​ చేయాలన్నారు.   తెలంగాణా లో ఉన్న ఐటిఐ ఇనిస్టిట్యూట్స్ అన్నీ ..  దేశంలోనే నెంబర్ వన్  స్థానంలో ఉండాలన్నారు.

తాను గతంలో తెలంగాణ, ఏపీ ఇండస్ట్రీస్​కు ప్రెసిడెంట్​ గా ఉన్నానని మంత్రి వివేక్​వెంకటస్వామి తెలిపారు. విద్యార్థలకు స్కిల్​ డెవలప్​ మెంట్​ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు సీఎం రేవంత్​ రెడ్డి ఎప్పుడూ ముందు ఉంటారని... ఎక్కువ విద్యార్థులు అడ్మిషన్​ అయ్యేందుకు ప్రిన్సిపాల్స్​ దృష్టి పెట్టాలని మంత్రి వివేక్​ వెంకటస్వామి సూచించారు. 

Also Read : కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్లపై 50కి పైగా అభ్యంతరాలు

స్కిల్​ డెలవలప్​ సెంటర్స్​.. ఐటీఐ ఇనిస్టిట్యూట్స్​ లో ఫ్యాకల్టీని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 
విద్యార్థులకు  ఉపాధి.. ఉద్యోగ అవకాశాలు వచ్చేలా మంచి స్కిల్స్ నేర్పించాలన్నారు.కేంద్రం నుంచి ఫండ్స్ వచ్చే విధంగా  కృషి చేసి... తెలంగాణలో ఐటీఐ ఇనిస్టిట్యూట్స్​ ను అభివృద్ది చేస్తానని మంత్రి  వివేక్​ వెంకటస్వామి అన్నారు.  స్కిల్ డెవలప్​మెంట్​ కోసం ఇంకా 4 వేల  కోట్లు బడ్జెట్ కావాలని... సీఎం తో మాట్లాడి నిధులు మంజూరుకు ప్రయత్నిస్తానన్నారు. 

మందమర్రి లాంటి ఐటీఐ ఇనిస్టిట్యూట్  లో సరైన సౌకర్యాలు లేవని తన దృష్టికి వచ్చిందని..  అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని... తాను ఎప్పుడూ  అందుబాటులో ఉండి..  అన్ని ఐటీఐ ఇనిస్టిట్యూట్స్ ను  విజిట్ చేస్తానని  మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు.