పద్మారావునగర్, వెలుగు: మహిళా అధికారులను మంత్రులు అగౌరవపరిచేలా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు సునీత లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్రెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు స్వతంత్రంగా పనిచేశారని, ఇప్పుడు వారిని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు.
మహిళా అధికారులను మంత్రులు తమ నివాసాలకు పిలిపించి రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఇది మహిళలను అగౌరవపరచడమేనని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం బుద్ధభవన్లోని మహిళా కమిషన్ కార్యాలయంలో సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు.
