కనుల పండువగా నృసింహుడి కల్యాణం 

కనుల పండువగా నృసింహుడి కల్యాణం 

రేగొండ, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా కల్యాణం శుక్రవారం కనుల పండువగా సాగింది. జయశంకర్​ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావుతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామివారి ధ్వజారోహణ, అభిషేకం, పలు ప్రత్యేక పూజలు ప్రధాన అర్చకులు బుచ్చామాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు.

అలాగే అశ్వవాహన సేవ, గరుత్మంతుడి ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రద్దీ దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్, ఈవో మహేశ్​ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వరంగల్ మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు పలువురు హాజరయ్యారు.