
పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ లోకి శుక్రవారం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. కర్నాటకలో కురుస్తున్న వర్షాలకు 550 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.440 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
523.600 మీటర్లకు గాను 521.355 మీటర్ల నీటి మట్టానికి చేరుకుంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ ద్వారా 80, మిషన్ భగీరథ పథకానికి 70 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని ఇరిగేషన్ జేఈ మహిపాల్ రెడ్డి తెలిపారు.