కరెంట్ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌ను రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

కరెంట్ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌ను రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

 

  • ఆలూరు విద్యుత్‌‌‌‌ సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఘటన 

చేవెళ్ల, వెలుగు: విద్యుత్​ సబ్​స్టేషన్‌‌‌‌లో  ఆపరేటర్‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని బండరాళ్లతో  కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన చేవెళ్ల పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఆలూరు గ్రామంలో చోటు చేసుకుంది.  చేవెళ్ల ఎస్సై ప్రదీప్​కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం..  చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి మండల పరిధిలోని మోకిల గ్రామానికి చెందిన హర్యానాయక్‌‌‌‌  (40) ఆలూరు గ్రామంలోని విద్యుత్​ సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఆపరేటర్‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్నాడు.  

గురువారం విధుల్లో భాగంగా సబ్​స్టేషన్​లో ఉండగా రాత్రి 12.40 గంటలకు గ్రామానికి చెందిన వాటర్​ లైన్​మెన్​ ఎల్లకొండ శ్రీనివాస్​కు  హర్యానాయక్​ ఫోన్​ చేసి ఇక్కడకు రావాలని,  కొంత మంది నేపాల్​ రాష్ర్టానికి చెందిన వ్యక్తులు  నాతో  గొడవ పడుతున్నారని తెలిపాడు..  ఎల్లకొండ శ్రీనివాస్‌‌‌‌కు  గ్రామంలో జాతర ఉత్సవాల్లో పాల్గొన్నందుకు వెంటనే సబ్​ స్టేషన్‌‌‌‌కు వెళ్లలేదని, రాత్రి 2.30 గంటలకు వెళ్లి చూడగా హర్యానాయక్​ రక్తపు మడుగుల్లో  పడి మృతిచెంది ఉన్నాడని తెలిపారన్నారు.

   ఎల్లకొండ శ్రీనివాస్​ ఏఈ  జానీమోమిదీన్‌‌‌‌కు సమాచారమివ్వడంతో  చేవెళ్ల పోలీసులకు  ఫిర్యాదు చేశారని తెలిపారు.  డబ్బుల కోసమే దుండగులు హత్య చేశారని విద్యుత్​శాఖ అధికారులు,  పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  తెలిపారు.