పిల్లలు భవిష్యత్లో ఆరోగ్యంగా ఉండేందుకు వేయించే వ్యాక్సినేషన్ పేరెంటింగ్లో ఎదురయ్యే చాలెంజెస్లో ఒకటి.. . అది చాలెంజ్ ఎందుకంటే, నెలలవారీగా వ్యాక్సిన్ షెడ్యూల్ ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకుని ఎలాంటి పరిస్థితుల్లోనైనా వేయించాలి. ఇంతకుముందు ఈ వ్యాక్సినేషన్ విషయంలో పేరెంట్స్కి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ కరోనా కాలంలో పిల్లలను హాస్పిటల్స్కి తీసుకెళ్లడానికి చాలా భయపడుతున్నారు. దాంతో కొంతమంది షెడ్యూల్ ప్రకారం పిల్లలకు వ్యాక్సిన్ వేయించట్లేదని చెప్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
సాధారణంగా పిల్లలకు పుట్టినప్పట్నించి ఏడాది, రెండేళ్ల వరకు వ్యాక్సినేషన్ ఉంటుంది. అలాంటిది చాలామంది అమ్మానాన్నలు బయటికి, హాస్పిటళ్లకు వెళ్తే ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతో వ్యాక్సిన్ వేయించడాన్ని మిస్ చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ సేకరించిన డేటా ప్రకారం సుమారు ఎనిమిది కోట్లమంది పిల్లలకు డిప్తీరియా, మీజిల్స్, పోలియో రాకుండా వేయించే వ్యాక్సినేషన్ని మిస్ చేశారట పేరెంట్స్. ఈ వ్యాక్సినేషన్ పిల్లలను వ్యాధుల బారినపడకుండా కాపాడుతాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. మిస్ అయిన టీకాలను త్వరగా వేయించండని డాక్టర్లు చెప్తున్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్లాక్ జరుగుతోంది కాబట్టి.. పిల్లలకు మిస్ అయిన వ్యాక్సినేషన్ని వేయించొచ్చు. తెలిసిన పీడియాట్రిషియన్ని సంప్రదించి పిల్లల వయసుని బట్టి టీకాలు వేయించాలి. లేదంటే భవిష్యత్లో పిల్లలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు పూర్తి బాధ్యత అమ్మానాన్నలదే అవుతుంది. హాస్పిటల్కి వెళ్లేటప్పుడు పేరెంట్స్తో పాటు పిల్లలకు కూడా ఫేస్షీల్డ్, గ్లోస్ వాడాలి. శానిటైజర్తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. వ్యాక్సినేషన్ వల్ల పిల్లలకు మామూలుగా వచ్చే జ్వరానికి ముందుగానే సిరప్ కొనిపెట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ బిడ్డల భవిష్యత్ని కాపాడుకోవాలి.