బీజేపీ నేత ముక్కెర తిరుపతిరెడ్డి పేట్ బషీరాబాద్ పీఎస్ లో ప్రత్యక్షం

బీజేపీ నేత ముక్కెర తిరుపతిరెడ్డి పేట్ బషీరాబాద్ పీఎస్ లో ప్రత్యక్షం

హైదరాబాద్ అల్వాల్ లో అదృశ్యమైన బీజేపీ నేత ముక్కెర తిరుపతిరెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. తిరుపతిని ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. అదృశ్యంపై సమాచారం తెలుసుకునేందుకు ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. జులై 13వ తేదీ గురువారం రోజు అల్వాల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట తన  భర్తను గుర్తు తెలియని వ్యక్తులు  కిడ్నాప్ చేశారని తిరుపతిరెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

జులై 13వ తేదీ నుంచి తిరుపతిరెడ్డి ఎక్కడ ఉన్నారు...? ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు..? ఆయన భార్య ఆరోపించినట్లుగా తిరుపతిరెడ్డిని ఎవరైనా కిడ్నాప్ చేశారా..? లేక తనంతట తానే కనిపించకుండా పోయారా..? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. తనకు ఎవరితో భూ వివాదాలు ఉన్నాయనే కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.