బాలానగర్లో 15 రోజులుగా భగీరథ నీళ్లు బంద్

బాలానగర్లో 15 రోజులుగా భగీరథ నీళ్లు బంద్

బాలానగర్ , వెలుగు: మిషన్  భగీరథ నీళ్లు రాకపోవడంతో మండలకేంద్రంలోని ప్రజలు తిప్పలు పడుతున్నారు. మండల కేంద్రంలోని రింగ్ రోడ్డు ప్రాంతంలో 15 రోజులుగా భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో ఎస్సీ కాలనీల్లోని బోర్ల నుంచి నీరు పట్టుకుని మోసుకుంటూ, సైకిళ్లపై తెచ్చుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మిషన్  భగీరథ నీళ్లు సప్లై చేయాలని కోరుతున్నారు.