
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్(మిషన్కాకతీయ) కమిటీ ఆఫ్ ఇంజినీర్స్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మైనర్ఇరిగేషన్ సీఈ కమిటీకి చైర్మన్గా ఉండగా.. డిపార్ట్మెంట్ రీ ఆర్గనైజేషన్ తర్వాత ఆ వింగ్లేకుండా పోయింది. దీంతో కమిటీ చైర్మన్గా ఆపరేషన్స్అండ్మెయింటనెన్స్ఈఎన్సీని నియమించారు. గతంలో కమిటీ సభ్యుడిగా రోడ్స్ వింగ్ సీఈ ఉండగా ఇప్పుడు స్టేట్ రోడ్స్ ఈఎన్సీని నియమించారు. ఇరిగేషన్ డీసీఈ – 2 కమిటీకి సెక్రటరీగా ఉండగా, ఓ అండ్ఎం ఈఈని నియమించారు. గతంలో సదరన్ రైల్వేస్ – చెన్నై, ఈస్ట్కోస్ట్ రైల్వేస్ – భువనేశ్వర్కు చెందిన ఇంజినీర్లు సభ్యులుగా ఉండగా.. వారి స్థానంలో హైదరాబాద్మెట్రో వాటర్, సీవరేజీ బోర్డు డైరెక్టర్, మిషన్ భగీరథ సీఈలను నియమించారు. కమిటీలో మిగతా సభ్యులుగా పబ్లిక్ హెల్త్ సీఈ, సౌత్ సెంట్రల్ రైల్వే – సికింద్రాబాద్, సౌత్ వెస్ట్రన్ రైల్వే – హుబ్లీ నుంచి ఇంజినీర్లు ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కమిటీ రీ కన్స్ట్రక్షన్
గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కు అవసరమైన ఔట్సోర్సింగ్ మ్యాన్పవర్ఏజెన్సీ ఎంపిక కమిటీని పునర్వ్యస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు పర్యవేక్షించే డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ఆఫీసర్లలో ఒకరు మెంబర్ కన్వీనర్గా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.