మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేష్ బాబుకు.. ట్రెండింగ్ డైరెక్టర్ అవార్డు

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేష్ బాబుకు.. ట్రెండింగ్ డైరెక్టర్ అవార్డు

క్రేజీ హీరో నవీన్ పొలిశెట్టి(Naveenpolishety), అనుష్క శెట్టి(AnushkaShetty) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(MissShettyMrPolishetty). సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ మూవీ..థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. కామెడీ,ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాను అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ మహేష్ బాబు.

లేటెస్ట్గా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబుకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ట్రెండింగ్ డైరెక్టర్ అవార్డు వరించింది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అయిన..యూవీ క్రియేషన్స్(UV Creations) ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ..వైరల్ అయిపోయాం..మహేష్ బాబు మా డైరెక్టర్ అని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందంటూ..పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లీక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో, ఓటీటీ లో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.   

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన రారా కృష్ణయ్య మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన పి.మహేష్ బాబు..కొంత విరామం తీసుకుని తెరకెక్కించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. 

 ALSO READ : ఫ్యామిలీ ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తోన్న.. లియో థర్డ్ సింగిల్

 మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కథ విషయానికి వస్తే.. జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనే ఆలోచన ఉన్న ఒక అమ్మాయి..మ్యారేజ్ కాకుండా తల్లి అవడంలో సంతోషాన్ని కోరుకుంటుంది. అందుకోసం ఒక అబ్బాయి హెల్ప్ తీసుకుంటుందనే అంశం ఆసక్తి కలిగిస్తోంది. ఇలా స్టార్ట్ అయిన వీరిద్దరి జర్నీ..ఎక్కడ ముగిసింది. ఈ క్రమంలో వీరిద్దరికి ఎదురైన పరిణామాలు ఏంటి. వాళ్లు మానసికంగా ఎలాంటి ఎమోషన్‌కు గురయ్యారు అనేది ఈ సినిమా కథ.