రిజల్ట్ తప్పుడుతడకంటూ సోషల్ మీడియాలో ఫైర్
మందమర్రి, వెలుగు: ఇటీవల సింగరేణి సంస్థలో జూనియర్అసిస్టెంట్పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో ‘తెలంగాణ’, ‘ఆంధ్రప్రదేశ్’ అనే స్టూడెంట్లకు సైతం మార్కులు వచ్చాయి. సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన ఫలితాల్లో ఈ రెండు రాష్ట్రాల పేర్లు కూడా క్వాలిఫై అయ్యాయి. రిజల్ట్ లో రాష్ట్రాలు, ఇతర పేర్లు రావడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. తప్పులతడకగా ఉన్న రిజల్ట్వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సింగరేణి సంస్థలో 177 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 4న ఎనిమిది జిల్లాల్లో 187 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. 77,898 మంది పరీక్ష రాశారు. శనివారం పరీక్ష ఫలితాలను రిలీజ్చేశారు. పరీక్షల్లో 49,398 మంది అర్హత సాధించినట్లు జెన్టీయూహెచ్ డైరెక్టర్ విజయ్కుమార్రెడ్డి, సింగరేణి డైరెక్టర్ (పా, ఆపరేషన్స్) చంద్రశేఖర్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. జూనియర్అసిస్టెంట్పోస్టుల విషయంలో మొదటి నుంచి పైరవీకారుల దందా ఉందని, పెద్ద మొత్తంలో అభ్యర్థుల నుంచి దండుకున్నారని ప్రచారం జరిగింది. ఏకంగా మంచిర్యాలకు చెందిన ఒక స్టడీ సెంటర్ నిర్వాహకుడు అభ్యర్థులను గోవాకు తీసుకువెళ్లి పేపర్లీక్ చేశాడని కూడా జోరు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని సింగరేణి యాజమాన్యం కొట్టిపారేసింది. ఎలాంటి అవకతవకలు జరుగలేదని పేర్కొంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తుండగా శనివారం సాయంత్రం పొద్దుపోయాక రిలీజ్చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ఫలితాల్లో అభ్యర్థుల పేర్లకు బదులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, డిగ్రీ అంటూ వచ్చాయి. తెలంగాణ పేరుపై లోకల్అభ్యర్థి, 52.710 మార్కులు, 4026 ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ పేరుపై 28.960 మార్కులు, నాన్లోకల్, 31,187 ర్యాంకు, డిగ్రీ పేరుపై ఫిమేల్27. 290 మార్కులు, 34,172 ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. హాల్టికెట్లో సైతం తెలంగాణ అనే పేరు ఉండగా కింద సంతకం శ్రీధర్అని ఉంది. ఆంధ్రప్రదేశ్హాల్టికెట్పై మణికంఠ, డిగ్రీ హాల్టికెట్పై లలిత అని సంతకాలు ఉన్నాయి. పరీక్ష సమయంలో అటువంటి పేరు కలిగిన వారి పత్రాలను పరిశీలించకుండా ఇన్విజిలేటర్లు, నిర్వాహకులు ఏ విధంగా పరీక్ష రాసేందుకు అనుమతించారని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థుల బదులు రాష్ట్రాలు, ఇతర పేర్లు రావడం ఆఫీసర్ల నిర్లక్ష్యానికి నిలువుటద్దమని పలువురు సోషల్ మీడియాలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఎంక్వైరీ చేయాలె..
రామకృష్ణాపూర్: సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఫలితాలు, కీ పేపర్లలో తప్పులు వచ్చాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రామగిరి రామస్వామి ఆరోపించారు. ఆదివారం రామకృష్ణాపూర్లోని యూనియన్ఆఫీస్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో సీల్ లేకుండా ప్రశ్నాపత్రాలు రావడమే కాకుండా, కీలో తప్పులు దొర్లాయన్నారు. క్వాలిఫై కాని వారి మార్కులు విడుదల చేయలేదని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. జేఎన్టీయూహెచ్, సింగరేణి యాజమాన్యం సంయుక్తంగా విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో కూడా అభ్యర్థుల పేర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, డిగ్రీ అంటూ రావడంపై వివరణ ఇవ్వాలన్నారు. కంపెనీలో ఇంటర్నల్ పరీక్షల తేదీని వెంటనే ప్రకటించాలన్నారు. సింగరేణి మొండివైఖరి కారణంగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉత్పన్నమైందన్నారు. సింగరేణి సంస్థ గతయేడాది ఆర్జించిన వాస్తవ లాభాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.