చికెన్లో మత్తు కలిపి.. తల్లీ కూతుళ్లపై గ్యాంగ్ రేప్

చికెన్లో మత్తు కలిపి.. తల్లీ కూతుళ్లపై గ్యాంగ్ రేప్

అద్దెకుంటున్న వారిపై ఇంటి ఓనర్, మరో ఇద్దరి అఘాయిత్యం
ఉస్మానియాలో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితులు

శేరిలింగంపల్లి, వెలుగు: చికెన్లో మత్తుమందు కలిపి తల్లీకూతుళ్లపై ఇంటి ఓనర్, అతడి అనుచరులు అత్యాచారానికి పాల్పడ్డారు . ఈ దారుణ ఘటన మంగళవారం హైదరాబాద్లోని చందానగర్లో జరిగింది. సందయ్య నగర్లో ఓ వ్యక్తి కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య(35), కూతురు (14), కొడుకు (12) ఉన్నారు. మసీదుబండలో టైలర్ గా పనిచేసే గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లో అతడి కుటుంబం అద్దెకు ఉంటోంది. మంగళవారం గంగాధర్, అతడి దగ్గర పనిచేసే నగేశ్ (48), గణేశ్(40)లు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. భార్యాపిల్లలు మత్తులో పడి ఉండడాన్నిభర్త గమనించాడు. ఆ మత్తులోనే ఇంటి ఓనర్ గంగాధర్, మరో ఇద్దరు వచ్చి చికెన్ వండించుకున్నారని అతడి భార్య చెప్పింది. వాళ్లు తిన్నాక తమకూ ఇచ్చారని, దాన్ని తిన్నాక మత్తులోకి జారుకున్నామని వివరించింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వాళ్లొచ్చి ముగ్గురినీ ఉస్మానియాకు తరలించారు. తల్లీకూతుళ్లు కోలుకోగా.. ఆ చిన్నారి అపస్మారక స్థితిలోనే ఉన్నాడు.

20 వేలిస్తం.. రాజీకి రండి
పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న గంగాధర్.. రాజీకి వచ్చాడని బాధితురాలు చెబుతోంది. ఆస్పత్రికి వచ్చి రూ.20 వేలిస్తామని అన్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేయొద్దన్నాడని చెప్పింది. నిందితులను పోలీసులు విచారించగా.. తామూ చికెన్ తిన్నామని, తమకేం కాలేదని చెప్పినట్టు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారమే మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముందుగా వాళ్లు తిని, ఆ తర్వాత మత్తు మందు కలిపి ఇచ్చి ఉంటారని అంటున్నారు.

For More News..

20 రోజులు.. 30 వేల కేసులు