- ప్రేమ, పెండ్లి పేరుతో డ్యాన్సర్ మోసం
- రూ.12 లక్షలు వసూలు చేశాడని యువతి ఫిర్యాదు
- నిందితుడిని అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు
మియాపూర్, వెలుగు: ‘ఢీ’ షో డ్యాన్సర్ రాజుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ప్రేమ, పెండ్లి పేరుతో మోసం చేశారంటూ యువతిని ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ గోకుల్ ఫ్లాట్ అపార్ట్మెంట్ ఆరో ఫ్లోర్లో ఓ యువతి(28) బొటిక్ షాప్ రన్ చేస్తోంది.
ఇదే బిల్డింగ్లోని మూడో అంతస్తులో ఢీ షో ఫేమ్చిట్టి మాస్టర్ ‘చిట్టి డ్యాన్స్’ స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఈ స్టూడియోలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఢీ షో సీజన్ 10 విన్నర్ రాజు ప్రతిరోజు వచ్చేవాడు.
ఒకే బిల్డింగ్ కావడంతో రాజుకు సదరు యువతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రాజు యువతిని ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఇద్దరు శారీరకంగా కలిశారు. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని డబ్బులు కావాలని అడగడంతో సదరు యువతి రాజుకు ఫోన్పే ద్వారా పలుమార్లు రూ.12 లక్షల వరకు చెల్లించింది.
అయితే పెండ్లి చేసుకోవాలని అడిగిన ప్రతిసారి రాజు సమాధానం చెప్పకపోవడంతో యువతి గట్టిగా నిలదీసింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె.. మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు రాజుపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం రిమాండ్కు తరలించారు.
