ఎన్నికలు వస్తేనే ఊర్లు గుర్తస్తాయా.. ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు

ఎన్నికలు వస్తేనే ఊర్లు గుర్తస్తాయా.. ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు

ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు నిరసన సెగ తగిలింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో పర్యటన కోసం వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్థులు అడుకున్నారు. ఎన్నికలు వస్తేనే ఊర్లు గుర్తస్తాయా అని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ని గ్రామస్థులు నిలదీశారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించకుండా ఓట్ల కోసం వస్తారా అంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Also Read :- మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వివేక్ వెంకటస్వామి

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆందోళనకారులను పోలీసులు అడుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెల‌కొంది.