‘నేను సైగ చేసి ఉంటే..’ : వైసీపీ కార్యకర్తలకు బాలకృష్ణ వార్నింగ్

‘నేను సైగ చేసి ఉంటే..’ : వైసీపీ కార్యకర్తలకు బాలకృష్ణ వార్నింగ్

తన మౌనాన్ని చేతగానితనం అనుకోవద్దని వైసీపీ కార్యకర్తలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. గురువారం హిందూపురంలో వైసీపీ కార్యకర్తలు తన పర్యటనను అడ్డుకోవడంపై మండిపడ్డ బాలయ్య..  తాను సైగ చేస్తే పరిస్థితి ఏమయ్యేదని హెచ్చరించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులకు అవగాహన లేక అసెంబ్లీలో గొడవ పడుతున్నారని, తాము చేసిన అభివృద్ధి కళ్లెదుటే కనబడుతుందన్నారు బాలకృష్ణ.  కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతోందని,  రాష్ట్రంలో రివర్స్‌ పాలన సాగుతుందని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా అభివృద్ధి చేయాలి? ఆదాయం ఎలా సమకూర్చుకోవాలి అనే విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని అన్నారు. దేశంలో ఎక్కడైనా రాజధాని ఒకేచోట ఉంటుందని తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానితో అభివృద్ధి సాధ్యమన్నారు.

సీఏం జగన్ గురించి ప్రస్తావిస్తూ.. మండలిని తండ్రి పునరుద్దరిస్తే తనయుడు రద్దు చేశాడని ఫైరయ్యారు. తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానని అధికారంలోకి వచ్చి, మండలిని రద్దు చేసి తండ్రి ఆశయాలు నీరు గార్చాడని సీఎం ని విమర్శించారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని, పేదల ఫించన్లు, రేషన్ కార్డులు, తొలిగిస్తున్నారని బాలకృష్ణ అన్నారు. ప్రభుత్వంపై  ప్రజల్లో తిరుగుబాటు వస్తోందన్నారు.  స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతుందన్నారు.