కాంగ్రెస్​ ప్రభుత్వం రైతు పక్షపాతి: ఎమ్మెల్యే బాలూ నాయక్

కాంగ్రెస్​ ప్రభుత్వం రైతు పక్షపాతి:  ఎమ్మెల్యే బాలూ నాయక్

దరాబాద్, వెలుగు: ఈ బడ్జెట్​ ద్వారా కాంగ్రెస్​ సర్కారు రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపితమైందని కాంగ్రెస్​ దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్​ అన్నారు. రైతు బిడ్డ సీఎం అయితే రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో రేవంత్​ రెడ్డి  నిరూపించారన్నారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత బీఆర్​ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. రైతులను అప్పులపాలు చేసింది బీఆర్​ఎస్​ ప్రభుత్వమేన్నారు. 

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్​ డిక్లరేషన్​లో రాహుల్​ గాంధీ ప్రకటించారని, అందులో భాగంగా ఇప్పటికే రూ.లక్ష వరకు మాఫీ చేశామని చెప్పారు. గత ప్రభుత్వం చెట్లు, పుట్టలకు రైతు బంధు ఇచ్చి రూ.26 వేల కోట్లు దుర్వినియోగం చేసిందన్నారు. కానీ, తమ ప్రభుత్వం నిజమైన రైతులకే రైతు భరోసా స్కీమ్​ను అమలు చేస్తుందని స్పష్టం చేశారు.