టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి : ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి : ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
  • ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 

ఘట్ కేసర్, వెలుగు: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి కష్టపడి చదివాలని స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సూచించారు. పోచారం డివిజన్ కొర్రెముల జడ్​పీ స్కూల్​లో బైనగారి నరేశ్​ సహకారంతో నిర్మించిన డైనింగ్ హాల్ ను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కిల్స్​, టెక్నికల్​ నాలెడ్జ్​ ఉంటే ప్రపంచంలోనే ఏదైనా సాధించగలమన్నారు.

అనంతరం మక్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైనగారి నాగభూషణం, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేశ్​గౌడ్, మాజీ ఎంపీటీసీ బొడ్డు వినోద నాగార్జున్  పాల్గొన్నారు.