పద్మారావునగర్, వెలుగు : కంటోన్మెంట్పరిధిలోని వార్డు- నంబర్2 రసూల్పురా కట్ట మైసమ్మ ఆలయ ప్రాంతంలో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే శ్రీగణేశ్పరిష్కరించారు. ఇంతకుముందు నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా బస్తీ పర్యటన చేయగా, తాగునీటి సమస్య ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రభుత్వ నిధులతో గురువారం కొత్త పవర్ బోర్వెల్ ఏర్పాటు చేయించారు. కంటోన్మెంట్ చీఫ్ ఇంజినీర్ ఉమాశంకర్, రసూల్పుర ఏరియా ఇంజినీర్ కేకే రెడ్డి పాల్గొన్నారు.---
