
సంగారెడ్డి టౌన్, వెలుగు: జూన్3న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బర్త్డేను పురస్కరించుకొని కోహ్లీ పీఏసీఎస్చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన పాటల సీడీని గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ఎమ్మెల్యే మాణిక్యరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి ఆవిష్కరించారు.
వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా గుండెల్లో నిలిచే నాయకుడు హరీశ్ రావు అన్నారు. కార్యక్రమంలో మాజీ టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్, మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, శివరాజ్ పాటిల్, గోపాల్, వరలక్ష్మి ఉన్నారు.