హుజూరాబాద్ తీర్పు రాబోయే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ ఇవ్వాలి

హుజూరాబాద్ తీర్పు రాబోయే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ ఇవ్వాలి

టీఆర్ ఎస్ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా పొంతన లేదని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతుల కళ్లల్లో సీఎం కేసీఆర్ మట్టి కొట్టాడని, రైతుల ఉసురు ఆయనకు తగులుతుందని ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ లు నిర్మించి, మత్స్యకారులకు సభ్యత్వం ఇవ్వకుండా వారి జీవితాల్లో మట్టి కొట్టాడంటూ తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డబ్బులు ఎర వేసి హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవాలని చూస్తే ఓటర్లు చెంప చెళ్లుమనిపించారని అన్నారు. కేసీఆర్ మద్యం సిసాలకు హుజూరాబాద్ ఓటర్లు సరైన తీర్పు ఇచ్చారన్నారు. హుజూరాబాద్ తీర్పు రాబోయే ఎన్నికల్లో సిద్దిపేటలో కూడా ఇవ్వాలన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

నేడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ 34వ పుట్టినరోజు

GHMCకి ప్రభుత్వం వేల కోట్ల పన్ను బకాయి