
కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం ఆర్టీసీ బస్సు నడిపి ప్రయాణికులను, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కల్వకుర్తి నుంచి గట్టుప్పలపల్లి రాంపూర్ మీదుగా తలకొండపల్లి వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్టాండ్ ఆవరణ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ఆర్టీసీ బస్సు నడిపి స్థానిక నాయకుల్లో ఉత్సాహం నింపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో విద్యుత్, రెవెన్యూ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, యాట నరసింహ తదితరులు పాల్గొన్నారు.