
- దిష్టిబొమ్మ దహనం
శంషాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శంషాబాద్ బస్టాండ్ వద్ద ఆదివారం రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్ యూఐ యువజన విభాగం అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు. తర్వాత కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కౌశిక్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు.