మొట్టమొదటి సారిగా మహిళల కోసమే..

మొట్టమొదటి సారిగా మహిళల కోసమే..

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ మొట్ట మొదటిసారిగా కేపీహెచ్బీలో కేవలం మహిళల కోసమే పార్కును కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏర్పాటు చేశారు. ఈ పార్కును ఆదివారం (జూన్ 5న) ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని, వారి సాధికారత కోసం పాటు పడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి సారిగా కూకట్ పల్లి నియోజకవర్గంలో మహిళల పార్కును ప్రారంభిస్తున్నామని, ఇందులో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, దీని నిర్వహణతో పాటు ఇతర అంశాల్లోనూ కేవలం మహిళలు మాత్రమే ఉంటారని తెలిపారు.