
చిన్నచింతకుంట, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని దేవరకద్ర ఎమ్మెల్లే మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆదివారం కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తీలు కడుతూనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసిందన్నారు.
పదేండ్లలో అప్పంపల్లి గ్రామానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేసిందని చెప్పారు. ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే, అదనంగా మరో వెయ్యి ఇండ్లు మంజూరు అవుతాయని తెలిపారు. ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేస్తానన్నారు.