అక్కడ మోదీ, ఇక్కడ కేడీలను గంగలో కలుపుదాం.. ఎమ్మెల్యే మక్కన్​ సింగ్​ రాజ్​ ఠాకూర్​

అక్కడ మోదీ, ఇక్కడ కేడీలను గంగలో కలుపుదాం.. ఎమ్మెల్యే  మక్కన్​ సింగ్​ రాజ్​ ఠాకూర్​

పెద్దపల్లి: అక్కడ మోదీ, ఇక్కడ కేడీలను గంగలో కలుపుదామని  ఎమ్మెల్యే  మక్కన్​ సింగ్​ రాజ్​ ఠాకూర్​ పిలుపునిచ్చారు. బీజేపీని బొందపెడదామన్నారు.  బీఆర్​ఎస్​  బానిస పాలన నుంచి విముక్తి కల్పించామన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్​, కేటీఆర్​  అప్పలు పాలు చేశారని మండపడ్డారు. పెద్దపల్లి ప్రాంతానికి కాంగ్రెస్​ సాగు నీరు ఇచ్చిందన్నారు. దేశానికే దశ దిశ ను చూపెట్టడానికి కాంగ్రెస్​ మ్యానిఫెస్టో ఉందన్నారు.

రైతుల నుంచి ప్రతి గింజను కొంటామన్నారు. కార్యకర్తలకు, రైతులకు ఎమ్మెల్యేందరితో పాటు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీతో పాటు అందుబాటులో ఉంటామన్నారు.  ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వంశీ గెలుపుకోసం ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్​లోకి తీసుకురావాలన్నారు. వంశీని బంపర్​ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్​ఎస్​ జెండా పట్టుకోవడానికే ఆలోచించాలన్నారు. వంశీని గెలిపించి పెద్దపల్లి నుంచి బెల్లంపల్లి, మంథని వరకు పారిశ్రామిక కారిడార్​ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్​లో వంశీ గర్జిస్తాడన్నారు.