బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన మంచిరెడ్డి

బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన మంచిరెడ్డి

బతుకమ్మ చీరల పంపిణీ దేశంలో ఎక్కడా లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మంచాల మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ చీరెల పంపిణీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంచిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ చీరలను, చెక్కులను మహిళలకు అందజేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం ఆడబిడ్డల కుటుంబానికి ఎంతో అసరా అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు పసుపు-కుంకుమ కింద సర్కారు సారెగా ప్రతి ఏటా బతుకమ్మ చీరెలను అందించి గౌరవిస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే బతుకమ్మ చీరల పంపిణీ దేశంలో మరెక్కడా లేదన్నారు. సిరిసిల్లలో మగ్గం ద్వారా నేసిన చీరలను ప్రతి సంవత్సరం మహిళలకు అందజేయడం జరుగుతుందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.