టైగర్ రిజర్వ్తో జిల్లాకు తీవ్ర నష్టం .. జీవో పత్రాలు దగ్ధం చేసి నిరసన

టైగర్ రిజర్వ్తో జిల్లాకు తీవ్ర నష్టం .. జీవో పత్రాలు దగ్ధం చేసి నిరసన

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ రిజర్వ్​గా ప్రకటిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 49ని రద్దు చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు డిమాండ్ చేశాడు. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ప్రభుత్వం జీవోను విడుదల చేసి అన్యాయం చేసిందన్నారు. ఆదివారం కాగజ్‌నగర్​లోని తన నివాసంలో ఎమ్మెల్యే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాను టైగర్ రిజర్వ్ గా చేస్తే అభివృద్ధి జరగదన్నారు. 

ఇప్పటికే రోడ్ల , బ్రిడ్జిల మంజూరు, రిపేర్లకు ఫారెస్ట్ అధికారులు అనుమతివ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ సమయంలో టైగర్ రిజర్వ్ ను కన్జర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేస్తే మొత్తానికే రోడ్లు, అభివృద్ధి పనులకు అనుమతులు రావని, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టైగర్ రిజర్వ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవోకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, టౌన్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ శివ నాయకులు జీఓ 49 కాపీలను దహనంచేసి నిరసన వ్యక్తం చేశారు.