నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదు..

నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదు..

 హైదరాబాద్ లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో న్యాయం చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మట్లాడుతూ.. గ్యాంగ్ రేప్ చేసిన వారిని ఎందుకు సీక్రెట్ గా దాస్తున్నారని మండిపడ్డారు. నిర్భయ కేసులో మైనర్ల పేర్లు బయటకు వస్తున్నాయి..మరి నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ కేసులో నిందితులు మైనారా.. మేజరా.. అన్నది కాదు అన్నారు.

పోలీసులు నిందుతులను బహిరంగంగా అరెస్టు చేసినట్లు ఎక్కడా రాలేదు. పోలీసులకు భయపడేవారు ఎవరూ లేరు అన్నారు. ఎందుకు వారిని సీక్రెట్ గా ఉంచుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు.  అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లును రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎంను ఎందుకు చేయరు అని అన్నారు. ఈ కేసులో నిందితులెవరో తెలుసుకోవాలనుకుంటున్నామని ఆయన డిమాండ్ చేశారు.

రెడ్ కలర్ మెర్సిడెస్ బెజ్ కారులో ఈ ఘటన జరిగింది. కానీ పోలీసులు ఇన్నొవాలో ఉన్నవారి అరెస్టు చేశారు. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు,హోం మంత్రి మనవడు ఉన్నారు..రెడ్ కల్లర్ బెంజ్ కారులో ఏం జరిగిందో మా దగ్గర వీడియోలు ఉన్నాయన్నారు. ఈ కేసులో దోషులను అరెస్టు చేసి శిక్ష విధించేదాక పోరాడుతామని రఘునందన్ డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచార వీడియోలు విడుదల చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు.