సొంత డబ్బుతో బస్ షెల్టర్లు ఓపెన్ :ఎమ్మెల్యే రఘునందన్​రావు

సొంత డబ్బుతో బస్ షెల్టర్లు ఓపెన్ :ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. బుధవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డులో తన సొంత డబ్బు రూ.7.60 లక్షలతో నిర్మించిన రెండు బస్సు షెల్టర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో ధర్మాజీపేట గ్రామస్తుల కోరిక మేరకు హామీ ఇచ్చిన రెండు బస్టాప్​లను ప్రజలకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో బాల వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగు నీటి సౌకర్యాన్ని కల్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

తమ గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావడంతో విద్యార్థులు, రైతులు, వ్యాపారులు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రోజూ రెండు పూటల బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ సంక్రాంతి తర్వాత గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి  బాలేశ్​గౌడ్, మట్ట మల్లారెడ్డి, సుంకోజు ప్రవీణ్​పాల్గొన్నారు.