మెదక్ జిల్లా కొల్చారం రైస్ మిల్లులో.. రూ.7.17 కోట్ల ధాన్యం మాయం

మెదక్ జిల్లా కొల్చారం రైస్ మిల్లులో.. రూ.7.17 కోట్ల ధాన్యం మాయం

కొల్చారం, వెలుగు: మెదక్ ​జిల్లా కొల్చారంలోని శ్రీ సత్యసాయి ఆగ్రో రైస్​ మిల్లులో భారీగా ధాన్యం మాయమైంది. విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్ ఎస్పీ శృతక్రీత, ఎంక్వైరీ ఆఫీసర్​ కోటేశ్వర్​ రావు, సర్కిల్​ ఇన్స్​పెక్టర్​ శశికాంత్​ రెడ్డి, ప్రశాంత్​ కుమార్, జిల్లా సివిల్​ సప్లై ఆఫీసర్​ నిత్యానందం సోమవారం రైస్​ మిల్లులో తనిఖీలు నిర్వహించారు.

2025-26 ఖరీఫ్​ సీజన్ కు సంబంధించిన 3029.960 మెట్రిక్  టన్నుల ధాన్యం (75,749 బ్యాగులు) తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.7,17,79,752 ఉంటుందని తెలిపారు. మిల్లర్​ డి. శ్రీనివాస్ పై ఈసీ యాక్ట్​ -1955 6-ఏ కింద కేసు నమోదు చేశారు. కలెక్టర్ కు నివేదిక సమర్పించినట్లు జిల్లా సివిల్​ సప్లై ఆఫీసర్​ నిత్యానంద్​ తెలిపారు.