అసెంబ్లీలో ప్రతి ఒక్కరు శాసనసభ నిబంధనలను పాటించాలి

అసెంబ్లీలో ప్రతి ఒక్కరు  శాసనసభ నిబంధనలను పాటించాలి

అసెంబ్లీలో ప్రతిఒక్కరు శాసనసభ నిబంధనలను పాటించాలన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రభుత్వం, స్పీకర్ కుట్రే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అని ఆరోపించారు.. తమకు న్యాయం జరుగుతుందని , న్యాయస్థానంపై తమకు పూర్తి విశ్వాసముందన్నారు. పిటిషన్ కాపీని సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణకు పంపుతున్నట్లు తెలిపారు. సీఎస్ సోమేశ్ కుమార్ పై ఉన్న రిట్ పిటిషన్ ను వెంటనే విచారించాలని రఘునందన్ డిమాండ్ చేశారు. 2017లో భారత ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ఎందుకు ఆగిందో తేల్చాలన్నారు. నిబంధనల ప్రకారం సోమేశ్ ను ఏపీకి కేటాయించారని...తెలంగాణలో ఎలా పనిచేస్తున్నారని ప్రశ్నించారు.