త్వరలోనే ఈటల పాదయాత్ర షురూ..

త్వరలోనే ఈటల పాదయాత్ర షురూ..

ఈటల రాజేందర్ ఆరోగ్యం మెరుగైందని.. ఆయన రేపు డిశ్చార్జ్ అవుతారని ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పారు.  ఈటల మళ్ళీ పాదయాత్ర కొనసాగిస్తారని ఆయన అన్నారు. ప్రజలను కలిసేందుకు ప్రజాక్షేత్రంలోకి మళ్లీ వెళ్తారని రాజాసింగ్ తెలిపారు. హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఈటల ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. మరోసారి కూడ ఈటలను ప్రజలు ఆశీర్వదించబోతున్నారని ఆయన అన్నారు. హుజూరాబాద్‌లో ఈటల గెలుస్తున్నరని రాజాసింగ్ జోష్యం చెప్పారు.