నాగర్ కర్నూల్ పట్టణంలో కాలేజీ బిల్డింగ్ కు .. రూ.9 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

నాగర్ కర్నూల్ పట్టణంలో కాలేజీ బిల్డింగ్ కు .. రూ.9 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్  కాలేజీకి కొత్త బిల్డింగ్​ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తెలిపారు. శిథిలావస్థలో ఉన్న కాలేజీ బిల్డింగ్​ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. 

గత ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. సంబంధిత అధికారులతో కాలేజీ భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేయించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో, రూ.9 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.