సొంత జాగలో ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు

సొంత జాగలో ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు
  • ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​

కోహెడ(బెజ్జంకి)వెలుగు: ఇల్లులేని పేదవారు సొంత జాగ ఉండి అందులో ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు ఇస్తామని మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ చెప్పారు. శనివారం మండలంలోని వడ్లూర్, బేగంపేట, బెజ్జంకి,గుండారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాలకు దీటుగా పల్లెలకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి  చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం టీఆర్​ఎస్​ కండువా కప్పి పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాజయ్య, రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, బోయినపల్లి శ్రీనివాస్ రావు, ఎల శేఖర్, బోనగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.