ప్రభుత్వ పథకాలన్నీ బీఆర్ఎస్ నాయకులు, అభిమానులకే ఇస్తామన్నారు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం విస్సంపల్లిలో పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని యువకులు నిరసనకు దిగారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వచ్చి యువకులను పక్కకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన రెడ్యానాయక్.. ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడబోమని.. బీఆర్ఎస్ నాయకులు, అభిమానులకు మాత్రమే అన్ని పథకాలు ఇస్తామని వేరే పార్టీ వారికి ఇవ్వబోమన్నారు .
Also Read :- సెప్టెంబర్ 21 న ఛలో ఢిల్లీ : ఆర్ కృష్ణయ్య
తమది కూడా రాజకీయ పార్టీనే ..తమకు ఓటు వేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామని రెడ్యానాయఖ్ తెలిపారు. తనను ఓడించడానికి గతంలో పనిచేశారని..ఇపుడు చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా డోర్నకల్ నియోజకవర్గంలో గెలిచేది తానేనన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఎవడూ పుట్టలేదన్నారు.