కాంగ్రెస్​ లీడర్లు రైతు వ్యతిరేకులు : సంజయ్ కుమార్

కాంగ్రెస్​ లీడర్లు రైతు వ్యతిరేకులు : సంజయ్ కుమార్

జగిత్యాల, రాయికల్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కాంగ్రెస్  నాయకులు రైతు వ్యతిరేకులని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. గురువారం జగిత్యాలలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయడం ఆ పార్టీకి రైతులపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వలేక చేతులెత్తేయడంతో ఆ రాష్ట్ర రైతులు ఆ పార్టీపై తిరగబడుతున్నారన్నారు.

రాష్ట్రంలో రైతుబంధుతో రైతులు సగర్వంగా పంటలు పండిస్తున్నారన్నారు.  అంతకుముందు రాయికల్​ మండలం అల్లీపూర్​ గ్రామంలో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏండ్లలో చేసి చూపించామన్నారు. చక్కర ఫ్యాక్టరీని మూసివేయించింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. పసుపు రైతుల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, ప్యాక్స్​చైర్మన్ సందీప్ రావు, దామోదర్ రావు, రాయికల్​ఏఎంసీ డైరెక్టర్​ సాయిరెడ్డి, రత్నాకర్​రావు, ముఖీద్​, మహేశ్‌‌‌‌‌‌‌‌, సాగర్​రావు, సత్యం, ప్రశాంత్​, శ్రీను, సంజీవరావు, భీమన్న తదితరులు పాల్గొన్నారు.