జనవరి 24న ఓయూలో ఎమ్మెల్యే వివేక్​కు సన్మానం

జనవరి 24న ఓయూలో ఎమ్మెల్యే వివేక్​కు సన్మానం

ఓయూ, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన వివేక్ వెంకటస్వామికి ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో సన్మానం చేయనున్నట్లు ఓయూ జేఏసీ కన్వీనర్ శ్వేత తెలిపారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి జేఏసీ నేతలు పోస్టర్‌‌ ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 24న మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ట్స్ కాలేజీ న్యూ సెమినార్ హాల్‌లో ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో వివేక్‌ వెంకటస్వామికి సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నామని వెల్లడించారు. ఇందులో గద్దర్‌‌ కూతురు వెన్నెల, లెక్చరర్‌‌ ప్రేమయ్య, ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌‌ గణేశ్‌ తదితరులు పాల్గొంటారని తెలిపారు.