కవితను కుట్ర పూరితంగా ఓడించారు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కవితను కుట్ర పూరితంగా ఓడించారు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఎన్నికల్లో కవిత గెలిస్తే తమపై ఆధిపత్యం చెలాయిస్తుందనే ఉద్దేశంతో ఆమె అనుచరులు, ఏడుగురు ఎమ్మెల్యేలు కలిసి కుట్ర పూరితంగా ఓడించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు 30 నుంచి 60 వేల మెజారిటీ వచ్చిందని, మరి ఆ ఓట్లు ఎటు పోయాయని ప్రశ్నించారు. రైతులతో నామినేషన్ కాంగ్రెస్ పార్టీ వెయిస్తే.. బీజేపీలోకి ఎందుకు వెళ్తున్నారని నిలదీశారు.

కవితను నిజామాబాద్ లో కనబడకుండా చేస్తే ఇష్టమొచ్చినట్టు వ్యవహరించవచ్చనే భావనతో ఆమె అనుచరులు, ఎమ్మెల్యేలు కలిసి ఓడించారని ఆరోపించారు. కవిత ఓడిపోవాలని..కాంగ్రెస్ గెలవాలనే తమకు ఉంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జీవన్ రెడ్డి.