మత్స్యకార సొసైటీలకు నగదు బదిలీ చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మత్స్యకార సొసైటీలకు నగదు బదిలీ చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మత్స్యకారుల వృత్తికి భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. వారి బతుకు దెరువు కోసం తక్షణమే చెరువులను పునరుద్ధరించాలని కోరారు. చేప పిల్లల పంపిణీలో దళారులను తొలగించాలని సూచించారు. మత్స్యకార సొసైటీలకు నగదు బదిలీ చేయాలని చెప్పారు. గంగపుత్రులకు సంక్షేమ పథకాలను నిరంతరం అమలు చేయాలని సూచించారు.

బలహీన వర్గాల ప్రజలందరికీ బీమా కల్పించాలన్నారు. కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని..రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ప్రజలు హక్కులను కోల్పోతున్నారని తెలిపారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా.. మత్స్యకారులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సన్మానం చేశారు.