అవకాశం వచ్చిందని విర్రవీగొద్దు.. తప్పుడు పనులు చేయొద్దు : ఎమ్మెల్సీ కడియం 

అవకాశం వచ్చిందని విర్రవీగొద్దు.. తప్పుడు పనులు చేయొద్దు : ఎమ్మెల్సీ కడియం 

స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మరోసారి పరోక్షంగా విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా అవకాశం వస్తే నిజాయితీగా, నిఖార్సుగా ఉండాలని.. అవకాశం వస్తే దండుకుని, దోచుకుని తినవద్దంటూ చురకలంటించారు. ప్రజాప్రతినిధిగా అవకాశం వస్తే పది మందికి, పది కుటుంబాలకు, పది గ్రామాలకు ఉపయోగపడాలన్నారు.

‘‘అవకాశం వచ్చిందని విర్రవీగొద్దు.. తప్పుడు పనులు చేయొద్దు.. సమాజానికి నష్టం కలిగించే పనులు చేయొద్దు’’ అంటూ ఎమ్మెల్యే రాజయ్యపై పరోక్షంగా విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లె గ్రామంలో కడియం శ్రీహరి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కడియం కామెంట్స్ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.