హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవితకు ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ‘డెవలప్మెంట్ ఎకనామిక్స్’ అనే ఇతివృత్తంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఈ నెల 30న ప్రసంగించాలని ఆమెకు ఇన్విటేషన్ అందింది. రాష్ట్ర స్థితిగతులును మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయాలని కోరారు.
తెలంగాణ అభివృద్ధి మోడల్, వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతుబంధుతో అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత కరెంట్ అంశాలపై ప్రసంగించనున్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడం, మిషన్ భగీరథ , విద్య, వైద్యం తదితరాలపై ఆమె మాట్లాడనున్నారు.