హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం లండన్ చేరుకున్నారు. బ్రిటన్కు చెందిన ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్కార్యకర్తలు ఆమెకు లండన్ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు.
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11.30 గంటలకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ‘‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూజివ్ డెవలప్మెంట్: ద తెలంగాణ మోడల్’’ అంశంపై ఆమె ప్రసంగించనున్నారు. తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, కరెంట్, విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు తదితర రంగాల్లో సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా వివరించనున్నారు.