లండన్కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

లండన్కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం లండన్ చేరుకున్నారు. బ్రిటన్​కు చెందిన ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్​కార్యకర్తలు ఆమెకు లండన్​ఎయిర్​పోర్టులో స్వాగతం పలికారు. 

భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11.30 గంటలకు ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీలో ‘‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూజివ్ డెవలప్​మెంట్: ద తెలంగాణ మోడల్’’ అంశంపై ఆమె ప్రసంగించనున్నారు. తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్​ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, కరెంట్, విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు తదితర రంగాల్లో సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా వివరించనున్నారు.