నిందితులెవరైనా వదిలిపెట్టేది లే: ఎమ్మెల్సీ కవిత

నిందితులెవరైనా వదిలిపెట్టేది లే: ఎమ్మెల్సీ కవిత

డాక్టర్ ప్రీతి తల్లిదండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తాను తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యానని చెప్పారు. ఎన్నో కష్టాలను తట్టుకుని పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి.. ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నా అన్నారు. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా.. అది చాలా తక్కువే అవుతుందని కవిత అన్నారు. 

మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. ప్రతీ మరణానికి కారణమైన నిందితులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని అన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఇకపై రిపీట్ కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. 

https://twitter.com/RaoKavitha/status/1630509223842025472