హైదరాబాద్, వెలుగు: వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నా ఏకైక లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి ప్రజలకు ఏం చేస్తుందో ఎజెండా ప్రకటించాలని డిమాండ్చేశారు.
గురువారం చెన్నైలో ఏబీపీ నెట్వర్క్నిర్వహించిన సదరన్ రైజింగ్సమ్మిట్లో ‘2024 సార్వత్రిక ఎన్నికలు : ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు?’ అనే అంశంపై ఆమె తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ చర్చలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తిగా ఎదిగాయని.. బీజేపీ, కాంగ్రెస్కన్నా ప్రాంతీయ పార్టీలే మంచి పనితీరు కనబరుస్తున్నాయని తెలిపారు.