
= బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి 100% ప్లాన్
= నేను ఆ ప్రయత్నాలను వ్యతిరేకించాను
= అయితే నన్ను రేవంత్ రెడ్డి కోవర్టు అంటారా?
= పెయిడ్ పోస్టులతో బద్నాం చేస్తే ఊరుకోను
= బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ లకే పరిమితం అయింది
= ఉద్యమాలు చేయకుండా.. ట్విట్టర్ లో మెసేజ్ లు పెడ్తే చాలా?
= నేను నల్లికుట్ల రాజకీయాలు చేయను
= బీజేపీ వాళ్లు హాస్పిటల్ పెడితే వెళ్ళిందెవరు?
= కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ
= నా పార్టీ బీఆర్ఎస్.. నా నాయకుడు కేసీఆర్
= కేసీఆర్ తప్ప.. ఇతరుల నాయకత్వంలో నేను పనిచేయను
= నన్ను పార్టీలోంచి బయటికి పంపే దమ్మెవరికీ లేదు
= కేటీఆర్, హరీశ్ లక్ష్యంగా కవిత విమర్శలు
హైదరాబాద్: బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేందుకు వందశాతం ప్లాన్ జరిగిందని, తాను ఆ ప్రయత్నాలను వ్యతిరేకించానని ఎమ్మెల్సీ కవిత కుండ బద్దలు కొట్టారు. అందుకే తనను రేవంత్ రెడ్డి కోవర్టు అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. పెయిడ్ పోస్టులతో బద్నాం చేస్తే ఊరుకోనని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లకే పరిమితమైందని అన్నారు. ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్ లో మెసేజ్ లు పెడితే చాలా అని ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ పోస్టులు పెట్టిస్తే మర్యాద అవుతుందా..? అని ప్రశ్నించారు. మా నాన్నకు నేను లేఖ రాస్తే నీకు నొప్పి ఏంటిరా బై..? అంటూ ప్రశ్నించారు. తాను బీజేపీలో విలీనాన్ని వ్యతిరేకించినందునే రేవంత్ రెడ్డి కోవర్టులని తనపై పడి ఏడుస్తున్నారని అన్నారు.
తమ నాయకుడు కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలో తప్ప ఇతరుల లీడర్ షిప్ లో పనిచేయబోనని అన్నారు. తనను పార్టీలోంచి బయటికి పంపే దమ్మెవరికీ లేదని అన్నారు. బీజేపీ వాళ్లు హాస్పిటల్ పెడితే వెళ్లిందెవరని పరోక్షంగా హరీశ్ రావును ఉద్దేశించి కవిత ప్రశ్నించారు..? తాను నల్లికుట్ట రాజకీయాలు చేయనని కూడా అన్నారు. పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా డ్రైవ్ చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో కోవర్టులున్నారని తనమీద పడి ఏడ్వడం కరెక్ట్ కాదన్నారు.
రాజీనామాకు సిద్ధమయ్యా
తాను లిక్కర్ కేసులో అరెస్టయినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నానని కవిత చెప్పారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని, వద్దని కేసీఆర్ చెప్పారని అందుకే రిజైన్ చేయలేదని కవిత చెప్పారు. తనకు కేసీఆర్ సపోర్ట్ ఉన్నందునే పదవిలో కొనసాగుతున్నానని అన్నారు.
కడుపులో బిడ్డతో ఉద్యమంలో పాల్గొన్నా
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను గర్భిణిని అని, కడుపులో బిడ్డను పెట్టుకొని ఉద్యమంలో పాల్గొన్నానని అన్నారు. తనను విమర్శించే నాయకులు చేసిన ఉద్యమాలేంటో చెప్పాలని పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. తాను అసలే మంచిదాన్ని కాదని, పెయిడ్ పోస్టులతో ఊరుకోబోనని చెప్పారు.
ట్విట్టర్ లో పోస్టు పెడితే చాలా?
బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ కే పరమితమైందని కేటీఆర్ ను ఉద్దేశించి కవిత అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. తన పై విమర్శలు చేసే వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం మార్చితే ఏం చేశారని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు జరగాలని కానీ అలా జరగలేదని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే అదానీ గురించి మాట్లాడటం ఏమిటన్నారు. రాష్ట్రానికి తెలంగాణ తల్లి ముఖ్యమా..? అదానీనా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసు వస్తే పార్టీగా ఏమీ చేయలేదని అన్నారు. పార్టీ లో చర్చ కూడా జరగలేదని, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలోంచి పంపే దమ్మెరికీ లేదు
‘మా నాయకుడు కేసీఆర్.. మా పార్టీ బీఆర్ఎస్..’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తనను పార్టీలోంచి బయటికి పంపే దమ్మెవరికీ లేదని అన్నారు. @మా డాడికి మాత్రమే లేఖ రాసిన .. పార్టీ అధ్యక్షుడు కి కాదు.. ఆ లేఖ ఎవరు బయట పెట్టారో తేలాలని అన్నారు. తాను తన తండ్రికి వంద లేఖలు రాశానని.. ఆయన సాధారణంగా వాటిని చదివి చించేస్తారని.. ఈ సారి తన ఖర్మకు ఆయన చించేయలేదని అన్నారు. కేసీఆర్ ను కాపాడుకోవాలని అన్నారు.
నేను క్లారిటీలోనే ఉన్నా
తాను కన్ఫ్యూజన్ లో లేనని, క్లారిటీతోనే ఉన్నానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. కాంగ్రెస్ మునిగే నావ అని, ఆ పార్టీలో చేరబోనని చెప్పారు. రాహుల్ గాంధీ కరెక్టుగా ఉంటే దేశానికి బీజేపీ దరిద్రం పట్టకపోయేదని అన్నారు. తనకు కొత్త పార్టీ అవసరం లేదని, ఉన్న పార్టీని కాపాడుకుంటే చాలని అన్నారు. తాను అమెరికా కి వెళ్లే 20 రోజుల ముందు నుంచి వరుసగా తనపై కుట్రలు మొదలయ్యాయని అన్నారు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పానని అన్నారు. అమెరికాకి పొయ్యి వచ్చేలోపు ఆ కుట్రలు చేసేశారని చెప్పారు.
పార్టీలో కోవర్టులు ఎవరు.. ఎందుకు వాళ్ళను కట్టడి చేయడం లేదని ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇస్తానని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్థాపించిన సాంస్కృతిక విభాగమే జాగృతి అని అన్నారు. అప్పుడు చురుగ్గా పనిచేశామని తర్వాత కేసీఆర్ సూచనలో స్లో అయ్యామని అన్నారు. ఇప్పుడు మళ్లీ రేవంత్ లాంటి ఉద్యమ ద్రోహి సీఎంగా ఉండడం తో మళ్లీ ఆక్టివ్ చేస్తున్నామని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని, తల వంచనని క్లారిటీ ఇచ్చారు.
కీ పాయింట్స్..!
= నేను మా డాడీకి వంద లెటర్లు రాసిన.. ఎప్పుడైనా చదివి చించేవారు
= నా ఖర్మ ఏంటో ఈ సారి చించలేదు.. ఆ లెటర్ బయటికెలా వచ్చింది
= ఇంటి ఆడబిడ్డపై ఎటు పడితే అటు మాట్లాడితే సరి కాదు
= లిక్కర్ కేసు టైం లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేద్దామనుకున్నా
= రాజకీయ కక్ష తో నీ పై కేసు పెట్టారు..రాజీనామా వద్దన్నారు
= కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న
= నన్ను విమర్శించే నాయకులు చేసిన కార్యక్రమాలు ఏంటో చెప్పాలి
= నేను వెన్నుపోటు రాజకీయాలు చేయ.. డేర్ గా మాట్లాడుతాను
= నేను కన్ ఫ్యూజ్ లో లేను.. క్లారిటీతో ఉన్నా.. కాంగ్రెస్ లో చేరను
= కొత్త పార్టీ అవసరం లేదని, ఉన్న పార్టీని కాపాడుకుంటే చాలు