రేవంత్, ఈటలకు వాతలే.. కవిత సెటైర్లు

రేవంత్, ఈటలకు వాతలే..  కవిత సెటైర్లు

హైదరాబాద్‌: కర్నాటకలో కాంగ్రెస్‌ పాలనా తీరును చూసి అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ రెండు స్థానాల్లో పోటీ చేయడంపై ఆమె సెటైర్లు వేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రేవంత్‌, ఈటల తీరు ఉందని ఎద్దేవా చేశారు. 

ఈ ఎన్నికల్లో వారికి వాతలు తప్పితే ఫలితం ఉండదన్నారు. నిజామాబాద్‌లో జరిగిన గోసంగి సామాజికవర్గం ఆత్మీయ సమ్మేళనంలో కవిత మాట్లాడారు. ‘గాంధీభవన్‌లోకి రేవంత్‌ అనే గాడ్సే దూరిండు. అందుకే బీసీలకు అన్యాయం జరుగుతోంది. కర్నాటకలో చక్కదనం లేదుగానీ అక్కడి సీఎం సిద్ధరామయ్య కామారెడ్డికి వచ్చి మాట్లాడుతున్నరు’ అని ఫైర్​అయ్యారు.