హైదరాబాద్ లోని సోమాజీగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.
కాగా మంత్రి వెంకట్రెడ్డి కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో నిన్న(డిసెంబర్ 12) ఢిల్లీ నుంచి తిరిగి రాగానే.. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో మంత్రికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయనను రెండు రోజులు దవాఖానలోనే ఉండాలని సూచించారు. దీంతో వెంకట్ రెడ్డి హాస్పిటల్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.