వీణవంక, వెలుగు : హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్పంచులు, కాంట్రాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి బాకీ ఉన్నాముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వీణవంక మండలంలోని బొంతుపల్లి, ఎల్భాక, గంగారం గ్రామాల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏ చౌరాస్తాకు చర్చకు వస్తారో రావాలని, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా సరేనన్నారు. రాష్ట్రంలో సర్పంచులకు, ఎంపీటీసీలకు సర్కారు బిల్లులు చెల్లించడం లేదని చెప్పడానికి సిగ్గు, శరం, ఇజ్జత్ లేదా అని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లోని 106 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి పెండింగ్ ఉన్నా ముక్కు నేలకు రాస్తానన్నారు. కేంద్రం ఈజీఎస్ కింద రూ.1400 కోట్లను తెలంగాణకు ఇవ్వకుండా సర్పంచ్ లను, ఎంపీటీసీలను ఇబ్బందులు పెడుతోందన్నారు. ఈ విషయంలో పది రోజుల్లో స్పందించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆ డబ్బులు ఇప్పించకపోతే స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీని నియోజకవర్గం లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ ముసిపట్ల రేణుక, తిరుపతిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
రూపాయి బాకీ ఉన్నా ముక్కు నేలకు రాస్తా
- తెలంగాణం
- June 4, 2022
లేటెస్ట్
- KKR vs DC: ఆ భయం ఉండాలి: ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్ ఆపేసిన హర్షిత్ రాణా
- బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే... చర్చకు ఎక్కడికైనా సిద్ధం : ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
- ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
- మునుగోడు గడ్డ.. కాంగ్రెస్ అడ్డా: రాజగోపాల్ రెడ్డి
- మోదీ సహకారంతోనే రేవంత్ రెడ్డి సీఎం : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
- కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దమే: భట్టి విక్రమార్క ఫైర్
- IPL 2024: మయాంక్ వచ్చేస్తున్నాడు.. వరల్డ్ కప్లో చోటు దక్కుతుందా..?
- జగిత్యాల జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం .. కోళ్లు, పశువులపై దాడి
- లైంగిక ఆరోపణలు .. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్
- Krishnamma: ఒక్క సినిమా కోసం ఐదుగురు స్టార్ డైరెక్టర్స్.. గట్టిగా ప్లాన్ చేసిన కొరటాల
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- T20 World Cup 2024: కోహ్లీ వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే.. సెలక్టర్లకు రోహిత్ డిమాండ్
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు